టాంక్ బండ్
హైదరాబాదు, సికందరాబాదు నగరాలను కలిపేలా హుస్సేన్ సాగర్ గట్టుమీదనుండి వెళ్ళే ట్యాంక్బండ్ రోడ్డుకు జంటనగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. సాయంకాలం వాహ్యాళికి వెళ్ళేవారికి, స్నేహితులను కలుసుకొనేవారికి, ఉదయం వడక సాగించేవారికి ఇది ఒక ఇష్టమైన స్థలం.
నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ రోడ్డుపై 33 విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. ఈ 33 మంది వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రమ సంస్కృతి, సాహిత్యాలలో విశిష్టమైన స్థానం కలిగిన మహనీయులు.
విగ్రహాల జాబితా
సికింద్రాబాదు నుండి వరసగా సమర్పణ ఫలకం
- అల్లూరి సీతారామరాజు
- ఆర్థర్ కాటన్
- ఎర్రాప్రగడ
- రుద్రమ దేవి
- మహబూబ్ ఆలీఖాన్
- సర్వేపల్లి రాధాకృష్ణన్
- సి.ఆర్.రెడ్డి
- గురజాడ అప్పారావు
- త్యాగయ్య
- త్రిపురనేని రామస్వామిచౌదరి
- పింగళి వెంకయ్య
- బళ్ళారి రాఘవ
- మగ్దూం మొహియుద్దీన్
- సురవరం ప్రతాపరెడ్డి
- జాషువ
- ముట్నూరి కృష్ణారావు
- శ్రీశ్రీ
- రఘుపతి వెంకటరత్నం నాయుడు
- రామదాసు
- శ్రీకృష్ణదేవరాయలు
- క్షేత్రయ్య
- పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
- బ్రహ్మనాయుడు
- మొల్ల
- తానీషా
- సిద్ధేంద్ర యోగి
- వేమన
- పోతనామాత్యుడు
- అన్నమాచార్య
- తిక్కన సోమయాజి
- నన్నయభట్టు
- శాలివాహనుడు